హైదరాబాద్: పాక్ ఆటగాళ్లు సైతం భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'అతను గొప్పవాడు అతని వికెట్ తీస్తే ఏ ఆటగాడైనా చాలా ఘనతగా భావిస్తారు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధోనీ వికెట్ నాకే దక్కింది. టీంకు ఎన్నో సార్లు ముగింపు దిశగా తీసుకెళ్లిన సందర్భాలున్నాయి అంటూ ధోనీని పైకెత్తేస్తున్నాడు. ' పాక్ బౌలర్ హసన్ అలీ.
పాకిస్థాన్ టీంకు ఈ మధ్యే ఎంపికైన హసన్ అలీ ఇంటర్నేషనల్ క్రికెట్లలో ఆడాడు. తనదైన శైలీలో చక్కని ప్రతిభను చూపిస్తున్నాడు. పాకిస్థాన్ జట్టులో టాప్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. తాజాగా అతను ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
ధోనీ భారత్కు రెండు ప్రపంచకప్లు అందించాడు. నాయకుడిగా జట్టును అద్భుతంగా నడిపించాడు. మరపురాని విజయాలు అందించాడు. అలాంటి గొప్ప ఆటగాడి వికెట్ ఏ బౌలర్కు దక్కినా సంతోషమే. నాకు కూడా అంతే. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఇండియాపై సాధించిన విజయాలు ఎప్పటికీ మరిచిపోలేను'అని అలీ తెలిపాడు. ఒకవేళ క్రికెట్ నుంచి దూరంగా ఉండాల్సి వస్తే 5 నుంచి 10 రోజుల కంటే ఎక్కువ దూరంగా ఉండలేను'అని వివరించాడు అలీ.
ఇదిలా ఉంచితే, అలీకీ పొగడ్తలు తక్కువేం రాలేదు. అవి వచ్చింది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దగ్గర్నుంచి. 'ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీర్ బౌలింగ్ను ఎదుర్కోవడం కాస్త కష్టమని కోహ్లీ తెలిపాడు. అతనో గొప్ప బౌలర్. ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొని తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. అతనితో కలిసి బౌలింగ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.