శుక్రవారం చెలరేగిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగారు. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ మూడో బంతికి ఫించ్ బౌల్డ్ కావడంతో ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. అనంతరం వచ్చిన ఉస్మాన్ ఖవాజా క్రీజులో కుదురుకునేలోపే మరో ఓపెనర్ హారిస్ (26), షాన్ మార్ష్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు.
|
క్రీజులో పాతుకుపోయిన ఉస్మాన్ ఖవాజా
దీంతో జట్టు స్కోరు 45 పరుగులలోపే ఇద్దరు టాపార్డర్ బ్యాట్స్మెన్స్ పెవిలియన్కు చేరడంతో అప్పటికే క్రీజులో ఉన్న ఉస్మాన్ ఖవాజా భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో పాతుకుపోయాడు. దీంతో ఖవాజాను కవ్విస్తూ అతడి ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా రిషబ్ పంత్ తన నోటికి పని చెప్పాడు.
|
భారత తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన పుజారా
కాగా, గురువారం ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో పుజారా (123) నిలకడగా ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోరు అందించిన సంగతి తెలిసిందే. దీంతో పుజారా తరహాలో ఉస్మాన్ ఖవాజా కూడా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన రిషబ్ పంత్ వికెట్ల వెనుక నుంచి ‘అందరూ ఇక్కడ పుజారాలు కాలేరు' అని స్లెడ్జింగ్కు దిగాడు.
|
అశ్విన్ బౌలింగ్లో ఔటైన ఉస్మాన్ ఖవాజా
అయితే, దీనిపై ఖవాజా స్పందించకపోవడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే ఖవాజా... అశ్విన్ బౌలింగ్లో రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో ట్రావిస్ హెడ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు.