న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఖవాజాను కవ్వించిన రిషబ్ పంత్: స్టంప్‌ మైక్‌లో రికార్డైన మాటలు (వీడియో)

India vs Australia 1st Test Day 2 : Rishabh Pant Sledges Aussie Batsmen,'Not everyone Is Pujara'
Everyone Cannot be Pujara: Pant Sledges Oz Batsman From Behind The Stumps

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారమైన రెండో రోజు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్లెడ్జింగ్‌కి దిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే షమీ(6) రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయింది.

తెలంగాణ ఎలక్షన్: ఓటేసిన సింధు, గోపీచంద్... గుత్తా జ్వాలా ఓటు గల్లంతుతెలంగాణ ఎలక్షన్: ఓటేసిన సింధు, గోపీచంద్... గుత్తా జ్వాలా ఓటు గల్లంతు

అనంతరం ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా (28: 125 బంతుల్లో) బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక నుంచి కవ్వింపు తరహాలో రిషబ్ పంత్ మాట్లాడిన మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

1
43623
శుక్రవారం చెలరేగిన భారత బౌలర్లు

శుక్రవారం చెలరేగిన భారత బౌలర్లు

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్‌ మూడో బంతికి ఫించ్‌ బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. అనంతరం వచ్చిన ఉస్మాన్ ఖవాజా క్రీజులో కుదురుకునేలోపే మరో ఓపెనర్ హారిస్ (26), షాన్ మార్ష్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు.

క్రీజులో పాతుకుపోయిన ఉస్మాన్ ఖవాజా

దీంతో జట్టు స్కోరు 45 పరుగులలోపే ఇద్దరు టాపార్డర్ బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు చేరడంతో అప్పటికే క్రీజులో ఉన్న ఉస్మాన్ ఖవాజా భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో పాతుకుపోయాడు. దీంతో ఖవాజాను కవ్విస్తూ అతడి ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా రిషబ్ పంత్ తన నోటికి పని చెప్పాడు.

భారత తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పుజారా

కాగా, గురువారం ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా (123) నిలకడగా ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోరు అందించిన సంగతి తెలిసిందే. దీంతో పుజారా తరహాలో ఉస్మాన్ ఖవాజా కూడా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన రిషబ్ పంత్ వికెట్ల వెనుక నుంచి ‘అందరూ ఇక్కడ పుజారాలు కాలేరు' అని స్లెడ్జింగ్‌కు దిగాడు.

అశ్విన్ బౌలింగ్‌లో ఔటైన ఉస్మాన్ ఖవాజా

అయితే, దీనిపై ఖవాజా స్పందించకపోవడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే ఖవాజా... అశ్విన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఆసీస్ జట్టులో ట్రావిస్ హెడ్ ఒక్కడే హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు.

Story first published: Friday, December 7, 2018, 16:20 [IST]
Other articles published on Dec 7, 2018
Read in English: Pant taunts Aussie batsmen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X