న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌దే: సొంతగడ్డపై లంకకు మరో పరాభవం

England win rain-hit ODI, secure Sri Lanka series

హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంక జట్టుకు సొంతగడ్డపై మరో పరాభవం. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను ఆ జట్టు ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 0-3తో కోల్పోయింది. శనివారం వరుణుడు ఆటంకం కలిగించిన నాలుగో వన్డేలో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఇంగ్లండ్‌ 18 పరుగులతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. షనక (66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌండరీలతో రెచ్చిపోగా.... ఓపెనర్‌ డిక్వెలా (52)తో పాటు ధనంజయ డిసిల్వా (66), తిసార పెరీరా (44) పరుగులతో రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 27 ఓవర్లలో 2 వికెట్లకు 132 పరుగుల వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఇంగ్లాండ్ విజయ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 115 పరుగులకు కుదించారు. డక్‌వర్త్‌ పద్ధతిలో ఇంగ్లాండ్‌ 18 పరుగులు ముందంజలో ఉన్నట్లు తేల్చిన అంపైర్లు ఆ జట్టునే విజేతగా ప్రకటించారు.

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జాసన్‌ రాయ్‌ (45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (32 నాటౌట్‌), కెప్టెన్‌ మోర్గాన్‌ (31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఈ సిరిస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, October 21, 2018, 12:35 [IST]
Other articles published on Oct 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X