హైదరాబాద్: యాషెస్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 135.5 ఓవర్లకు గాను 374 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 267/4తో మూడో రోజు ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లాండ్ మరో 107 పరుగులు జోడించి మిగితా వికెట్లను కోల్పోయింది.
ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో రోరీ బర్న్స్(133 పరుగులు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లయాన్లు చెరో 3 వికెట్లు తీయగా.. జేమ్స్ ప్యాటిన్సన్, పీటర్ సిడిల్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 90 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 284 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్(144) సెంచరీ సాధించాడు.
England are bowled out for 374.
— ICC (@ICC) 3 August 2019
They lead Australia by 90 runs.
Game on!#Ashes pic.twitter.com/stBcHJI9Lh