
ఐదు టెస్టుల సిరీస్లో పరిస్థితులు కఠినంగా ఉన్నాయి
"ఇంగ్లాండ్లో నేను ఇంతకు ముందు ఆడాను. ఐదు టెస్టుల సిరీస్లో పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. వచ్చేసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేటప్పుడు అలాంటి పరిస్థితులకు మరింత మెరుగ్గా సన్నద్ధం కావాలి. అక్కడి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఆటను వెలికితీయాలి. అక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. దానిని ఎదుర్కోవాలి" అని ద్రవిడ్ అన్నాడు.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై ఆసక్తి లేదు
"కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలపై ఆసక్తి లేదు. ఆ సిరీస్ నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మూడు నాలుగేళ్లకు ఒకసారి పర్యటిస్తుంటారు. జట్టు ఓటమి పాలవ్వడంతో కోచింగ్ బృందం, ఆటగాళ్లు నిరాశపడుతుంటారు. ఈ సారి మనకు ఉత్తమ జట్టు ఉంది. బౌలింగ్ బాగుంది కానీ దాంతో తగిన ఫలితాలు రాలేదు" అని ద్రవిడ్ అన్నాడు.

సిరీస్ గెలిచేందుకు టీమిండియాకు చాలా అవకాశాలు
"సిరీస్లో చాలా భాగం మంచి పోటీలోనే ఉంది. సిరీస్ గెలిచేందుకు టీమిండియాకు చాలా అవకాశాలు వచ్చాయి. కఠిన పరిస్థితుల్లో ఆటగాళ్లు కష్టపడ్డారు. అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేదు. మ్యాచ్లను సరిగా ముగించలేకపోయారు. సిరీస్లో కొన్ని సానుకూలాంశాలున్నాయి. మన బౌలింగ్, ఫీల్డింగ్ చాలా బాగున్నాయి" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

ఆసియా కప్పై స్పందించిన రాహుల్ ద్రవిడ్
ఇక, ఆసియా కప్ విషయానికి వస్తే, భారత్ కేవలం పాకిస్థాన్పైనే దృష్టి పెడుతుందని... అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ పోటాపోటీగా ఆడుతున్నాయి. అన్ని జట్లపై దృష్టి కేంద్రీకరించాలని ద్రవిడ్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












