హైదరాబాద్: టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు భారత యువ క్రికెటర్ పృథ్వీ షా ఉత్సాహాంగా ఉన్నాడు. ఇంగ్లీషు గడ్డపై టీమిండియాతో కలిసి తొలిసారి నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టుల కోసం బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో పృథ్వీ షా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ చేరుకున్న పృథ్వీ షా సోమవారం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. టీమిండియాతో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడం పృథ్వీ షాకు ఇదే మొదటిసారి. పృథ్వీ షాతో పాటు ఆంధ్ర ఆటగాడు హనమ విహారీ కూడా ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టులకు ఎంపికైన సంగతి తెలిసిందే.
📸📸
— BCCI (@BCCI) August 27, 2018
Snapshots from #TeamIndia's training session at The Ageas Bowl today.#ENGvIND pic.twitter.com/ngCDwgmcJh
Young @PrithviShaw gearing up for the nets session here at The Ageas Bowl.#ENGvIND pic.twitter.com/p5DdaReDrJ
— BCCI (@BCCI) August 27, 2018
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఆగస్టు 30 నుంచి సౌతాంప్టన్ వేదికగా ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆటగాళ్లు ప్రాక్టీస్లో పాల్గొన్న ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కోహ్లీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, పృథ్వీ షా, రహానె, కేఎల్ రాహుల్తో పాటు పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్లో పాల్గొన్నారు.
🙌💪
— BCCI (@BCCI) August 28, 2018
Watch #TeamIndia get into the groove ahead of the 4th Test against England at The Ageas Bowl in Southampton.#ENGvIND pic.twitter.com/nBYixzK99P