హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుతో మరి కొద్ది గంటల్లో ఆఖరి వన్డే అయిన మూడో వన్డే మొదలయ్యే ముందు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఉద్వేగపూరితమైన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దాంతో పాటుగా అభిమానుల నుంచి ఇదే ఆశిస్తున్నామని తెలిపాడు. విదేశీ లేదా స్వదేశీ గడ్డపై టెస్టు, వన్డే, టీ20 ఏదైనా సిరీస్లో తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు తలపడే రెండు జట్లు మైదానంలో జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటాయి.
కోహ్లీ పంచుకున్న ఈ వీడియో కూడా భారత జట్టు గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోదే. కాకపోతే ఇది ఎప్పటి మ్యాచ్, ప్రత్యర్థి ఎవరో కోహ్లీ చెప్పలేదు. అభిమానులతో స్టేడియం పూర్తిగా నిండిపోయింది. వారంతా జనగణమన పాడుతుంటే స్టేడియం హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే కోహ్లీ పోస్టు చేశాడు. ఇదే నిర్ణయాత్మక వన్డే కావడంతో.. క్రీడాభిమానుల్లో ఈ మ్యాచ్పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుతో మరి కొద్ది గంటల్లో ఆఖరి వన్డే అయిన మూడో వన్డే మొదలయ్యే ముందు టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఉద్వేగపూరితమైన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దాంతో పాటుగా అభిమానుల నుంచి ఇదే ఆశిస్తున్నామని తెలిపాడు. విదేశీ లేదా స్వదేశీ గడ్డపై టెస్టు, వన్డే, టీ20 ఏదైనా సిరీస్లో తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు తలపడే రెండు జట్లు మైదానంలో జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొంటాయి.
కోహ్లీ పంచుకున్న ఈ వీడియో కూడా భారత జట్టు గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోదే. కాకపోతే ఇది ఎప్పటి మ్యాచ్, ప్రత్యర్థి ఎవరో కోహ్లీ చెప్పలేదు. అభిమానులతో స్టేడియం పూర్తిగా నిండిపోయింది. వారంతా జనగణమన పాడుతుంటే స్టేడియం హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే కోహ్లీ పోస్టు చేశాడు. ఇదే నిర్ణయాత్మక వన్డే కావడంతో.. క్రీడాభిమానుల్లో ఈ మ్యాచ్పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.