హర్యానా: భారత క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇంటి వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. ఏప్రిల్ 19న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగు చూసింది.
హర్యానాలోని పంచకుల జిల్లాలో యువరాజ్ సింగ్ నివాసం ఉంది. ఆ ఇంటి ముఖద్వారంలో ఉన్న గేటు అతని మీద పడటంతో ఎనిమిది సంవత్సరాల పిల్లాడు చనిపోయాడని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరని తెలుస్తోంది.

యువరాజ్ సింగ్, అతని తల్లి గురుగ్రాంలోని తమ ఇంట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయం తేల్చేందుకు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.