న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న మరో క్రికెటర్

Ed Joyce Announces Retirement from All Forms of Cricket

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్ గుడ్ బై చెప్పిన మరుసటి రోజే మరో అంతర్జాతీయ క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ ఇరు జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఎడ్ జాయిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించాడు.

మే నెలారంభంలో పాకిస్థాన్‌తో..ఐదు రోజుల ఫార్మాట్ హోదా దక్కించుకున్న ఐర్లాండ్.. తొలి టెస్టు ఆడింది. అయితే ఈ మ్యాచ్ తన ప్రొఫెషనల్ క్రికెట్‌కు ఆఖరి మ్యాచ్ అంటూ జాయిస్ వీడ్కోలు పలకడం అందర్ని ఆశ్చర్యంలో పడేసింది. ఐర్లాండ్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం ద్వారా తన కల నెరవేరిందని చెప్పిన జాయిస్.. రిటైర్మెంట్‌కు ఇదే మంచి సమయమని చెప్పాడు.

39 ఏళ్ల జాయిస్.. ఇప్పటివరకు 78 వన్డేలు ఆడాడు. ఇందులో 17 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 18 టీ20ల్లో రెండు ఇంగ్లండ్‌కు ఆడాడు. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ తరఫున బరిలోకి దిగిన జాయిస్.. సీనియర్ బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకున్నాడు. 1999లో కౌంటీ కెరీర్‌ను మొదలుపెట్టిన జాయిస్.. గతేడాది దానికి వీడ్కోలు పలికాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న తాను కోచ్‌గా పని చేస్తానని వెల్లడించాడు.

అరుదైన ఘనతలు సొంతం చేసుకున్న ఎడ్ జాయిస్:
రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన 10 మంది క్రికెటర్లలో జాయిస్ ఒక్కడు కాగా, రెండు దేశాలకు టీ20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్ మాత్రం ఇతనే. అలాగే వన్డే ప్రపంచకప్‌లో రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్‌గానూ గుర్తింపు పొందాడు. 2007 ఇంగ్లండ్ తరఫున, 2011లో ఐర్లాండ్ తరఫున జాయిస్ ఆడాడు.

Story first published: Friday, May 25, 2018, 9:58 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X