హైదరాబాద్: దులీప్ ట్రోఫీని ఇండియా బ్లూ గెలుచుకుంది. శుక్రవారం ముగిసిన ఫైనల్లో 'బ్లూ' ఇన్నింగ్స్ 187 పరుగులతో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా రెడ్ను చిత్తు చేసింది. ఫాలోఆన్ ఆడుతూ ఓవర్నైట్ స్కోరు 128/5తో నాలుగో రోజు, శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రెడ్.. 172 పరుగులకు ఆలౌటైంది.
ENG vs IND 5th Test: ఓవల్లో 1000 పరుగులు, కుక్ ఖాతాలో మరో రికార్డు
స్పిన్నర్లు దీపక్ జగ్బీర్ హుడా (5/56), సౌరవ్ కుమార్ (5/51) ఇండియా రెడ్ పతనాన్ని శాసించారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 128/5తో నాలుగోరోజు ఆట కొనసాగించిన ఇండియా రెడ్ మరో 44 పరుగులకు మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది.
అంతకముందు తొలి ఇన్నింగ్స్లో ఇండియా బ్లూ 541 పరుగులు చేయగా.. రెడ్ 182 పరుగులకే కుప్పకూలింది. నిఖిల్ గంగ్టాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు:
ఇండియా బ్లూ తొలి ఇన్నింగ్స్: 541 (నిఖిల్ గంగ్టా 136, అన్మోల్ప్రీత్ సింగ్ 96, స్వప్నిల్ సింగ్ 69; పర్వేజ్ రసూల్ 4/150, మిహిర్ హిర్వాణి 3/19)
ఇండియా రెడ్ తొలి ఇన్నింగ్స్: 182 (సందీప్ 57; స్వప్నిల్ సింగ్ 5/58)
ఇండియా రెడ్ రెండో ఇన్నింగ్స్: 172 (అభినవ్ ముకుంద్ 46; సౌరభ్ కుమార్ 5/51, దీపక్ హూడా 5/56)