దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున బరిలోకి దిగిన రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 21 నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్లో పునరాగమనం చేసిన పంత్ టీ20 తరహా ఇన్నింగ్స్తో చెలరేగాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 34 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పంత్ ఫోర్, సిక్సర్ బాది, ఆ తర్వాత సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో నిలిచిన దశలో పంత్ క్రీజులోకి వచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సర్ఫరాజ్తో కలిసి మూడో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు 29 బంతుల్లోనే అర్ధశతకం భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం.

ప్రస్తుతం ఇండియా-బీ జట్టు 140/5తో నిలిచింది. 230 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్, నితీశ్ రెడ్డి ఉన్నారు. కాగా, ఇండియా-బీ మొదటి ఇన్నింగ్స్లో 321 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నవదీప్ సైని (56; 144 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. పంత్ 7 పరుగులే చేశాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37; 111 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు వికెట్లు తీశారు. సాయి కిశోర్ రెండు వికెట్లు పడగొట్టారు.
50 for Rishabh Pant! 👌
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
He brings it up off just 34 balls 🔥#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38DTlt pic.twitter.com/OPSfsvFhqI
Fuck it , i am Rishabh pant moment #RishabhPant pic.twitter.com/pYCxnwyfQz
— Harsh shekhawat (@wordofshekhawat) September 7, 2024