
స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుట్తో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ‘డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ' ఘటనను అంత సులభంగా వదలకూడదని భావించిన బీసీసీఐకి నిరాశే ఎదురైంది.

ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ
స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ రివ్యూ రెండో టెస్టు మ్యాచ్పై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, అతనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి సైతం బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంది. ఈ వివాదంలో స్మిత్, కోహ్లీపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

ఎలాంటి చర్యలు ఉండవని తేల్చి చెప్పిన ఐసీసీ
‘బెంగళూరు టెస్టులో జరిగిన ఘటనల విషయంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ ఆటగాడిపై కూడా ఆరోపణలు నమోదు చేయడం లేదని ఐసీసీ నిర్ధారిస్తోంది. స్టీవ్ స్మిత్, కోహ్లికి సంబంధించి జరిగిన రెండు సంఘటనలు కూడా మ్యాచ్లో భాగంగానే ఐసీసీ చూస్తోంది కాబట్టి ఆటగాళ్లపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండవు. ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా కీలక పాత్ర పోషించిన అద్భుతమైన టెస్టు మ్యాచ్ను మనం చూశాం. రాంచీలో జరిగే మూడో టెస్ట్పైనే దృష్టిసారించాలని ఇరు జట్లకూ సూచిస్తున్నాం. టెస్ట్ ఆరంభానికి ముందు మ్యాచ్ రెఫరీ ఇరు జట్ల కెప్టెన్లనూ పిలిచి వారి బాధ్యతలను గుర్తు చేస్తాడు' అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ చెప్పాడు.

ఐసీసీ నిర్ణయంపై బీసీసీఐ అసంతృప్తి
అయితే ఈ నిర్ణయంపై టీమిండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఐసీసీ నిర్ణయంపై కూడా అప్పీలుకు వెళ్లనున్నట్టు బీసీసీఐ పేర్కొంది. గురువారం ఈ విషయంపై భారత్ అప్పీలు చేయనున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











