DPL 2025: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రారంభమైంది. ఇప్పుడు రెండో సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 వేలం శనివారం, జులై 5న జరగనుంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలం జాబితా చాలా ఆసక్తికరంగా ఉంది. వేలం జాబితాలో విరాట్ కోహ్లీ అన్న కొడుకు పేరు కూడా ఉంది. అంతే కాకుండా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొడుకులు కూడా వేలం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు, విరాట్ కోహ్లీ అన్న కొడుకు పేరు కూడా ఆర్యవీర్ కావడం చాలా ఆసక్తికరమైన విషయం.
15 ఏళ్ల ఆర్యవీర్ కోహ్లీ.. విరాట్ కోహ్లీ అన్నయ్య వికాస్ కోహ్లీ కొడుకు. ఆర్యవీర్ ఒక లెగ్ స్పిన్ బౌలర్. ఆర్యవీర్ కోహ్లీ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ ఆధ్వర్యంలో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆర్యవీర్ కోహ్లీని వేలం జాబితాలోని కేటగిరీ సీలో ఉంచారు. గత సీజన్లో ఆర్యవీర్ కోహ్లీ ఢిల్లీ అండర్-16 జట్టు కోసం నామినేట్ చేయబడింది. ఢిల్లీ క్రికెట్లో నామినేట్ అయిన ఆటగాళ్లు 30 మందితో కూడిన తుది జట్టులో స్థానం సంపాదించిన వారు.

అదే విధంగా వీరేంద్ర సెహ్వాగ్ 17 ఏళ్ల కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా వేలం జాబితాలో ఉన్నాడు. అతడిని కేటగిరీ బీలో ఉంచారు. ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-19 జట్టు తరఫున ఆడాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ మేఘాలయపై 297 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ చిన్న కొడుకు వేదాంత్ సెహ్వాగ్ను కూడా కేటగిరీ బీలో ఉంచారు. వేదాంత్ ఢిల్లీ తరఫున అండర్-16 క్రికెట్ ఆడాడు.
ఈ సారి ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. గత సీజన్తో పోలిస్తే ఈ సారి ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 2 కొత్త జట్లు ప్రవేశించనున్నాయి. ఈ 8 జట్ల పేర్లు ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురానీ ఢిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్.. 2 కొత్త జట్ల పేర్లు అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీగా ఉన్నాయి.