కెప్టెన్సీ రేసులో ట్విస్ట్ ఇచ్చిన మాజీ సెలెక్టర్!
టీమిండియా టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమిస్తారనే వార్తలు జోరందుకున్న తరుణంలో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఇప్పటి నుంచే యువ నాయకులను తయారు చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
మిస్టర్ 360 ఫామ్పై చర్చ
ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో కొన్న హాఫ్ సెంచరీలు, అలాగే టీ20 ప్రపంచకప్లో అమెరికాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ కాపాడుకోలేకపోయాడు. సూర్య కెప్టెన్సీలోనే భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2026లో సూర్య ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ల్లో 147.54 స్ట్రైక్ రేట్తో కేవలం రెండు హాఫ్ సెంచరీల సహాయంతో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత ఏడాదిన్నర కాలంగా సూర్యకుమార్ యాదవ్ కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడని ఎమ్మెస్కే ప్రసాద్ అంగీకరించారు.

సెలెక్టర్ల సమావేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ
ఐర్లాండ్తో జరగబోయే రెండు మ్యాచ్ల సిరీస్, అలాగే ఇంగ్లాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి శనివారం ముంబైలో సెలెక్టర్లు సమావేశం కానున్నారు. దీంతో పాటు శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగే రెడ్-బాల్ మ్యాచ్ల కోసం భారత్ 'ఎ' జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. "మనం ప్రధాన జట్టును పంపుతున్నామా లేదా ద్వితీయ శ్రేణి జట్టును పంపుతున్నామా అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ ప్రధాన జట్టునే పంపిస్తే, సూర్యకుమార్ను పక్కన పెట్టడం తప్పు అవుతుంది, ఎందుకంటే ఇటీవల ఆయన మనకు ప్రపంచకప్ అందించి ఇచ్చాడు" అని పేర్కొన్నారు.
యువ నాయకత్వాన్ని సిద్ధం చేయాలి..
వచ్చే ఐదారు నెలల్లో లేదా ఇప్పటి నుంచే తదుపరి నాయకులను సిద్ధం చేసుకోవాలని ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచ కప్ విజయం సాధించే వరకు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడని గుర్తు చేశారు. భవిష్యత్ కోసం ఎవరైనా యువ ఆటగాడిని గుర్తించి సూర్యకుమార్ యాదవ్ను వైస్ కెప్టెన్గా నియమిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ప్రస్తుతం రజత్ పాటిదార్ వంటి ప్లేయర్లు రాణిస్తూ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నప్పటికీ.. ఆ సమయంలో సూర్యను కెప్టెన్సీ నుండి తొలగించడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఆయనకు మరికొన్ని సిరీస్లు అవకాశం ఇవ్వాలని, అప్పటికీ ఫామ్ పుంజుకోకపోతే వైస్ కెప్టెన్కు బాధ్యతలు అప్పగించవచ్చని చెప్పారు.
కెప్టెన్సీ రేసులో ఉన్న ఆటగాళ్లు వీరే..
సూర్యకుమార్ యాదవ్ తదుపరి వారసులుగా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ రేసులో ఉన్నారా అనే ప్రశ్నకు ప్రసాద్ సమాధానమిస్తూ.. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ బలమైన అభ్యర్థులని చెప్పారు. అలాగే సంజూ శాంసన్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా వ్యవహరించారని, ఇషాన్ కిషన్ కూడా ఇటీవల కెప్టెన్సీలో తన ప్రతిభను చాటుకున్నాడని తెలిపారు. వీరందరితో పాటు యువ ఆటగాడు తిలక్ వర్మపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. రాబోయే కాలంలో భారత టీ20 క్రికెట్ భవిష్యత్తుకు తిలక్ వర్మ ఒక సరైన సమాధానం కాగలడని ఎంఎస్కే ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications