ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం
ప్రపంచకప్ ఫైనల్లో తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
బౌండరీల నిబంధన ప్రకారం
ఇరు జట్ల స్కోరు సమమైనప్పుడు.. ఇలా బౌండరీల నిబంధన ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం తన దృష్టిలో సరైంది కాదని మోర్గాన్ తేల్చి చెప్పాడు. దీనిపై మోర్గాన్ మాట్లాడుతూ "ఇరు జట్లు సమంగా పోరాడిన సమయంలో ఇలాంటి ఫలితాన్ని ప్రకటించడం నాకు సమంజసంగా అనిపించలేదు" అని అన్నాడు.
ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో
"నేను ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిన విషయం నిజమే.. ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో నేను చెప్పలేను. ఇలా గెలువడం మంచిదని నేను అనుకోను. ఈ తరహా ఓటమిని ఎవరు జీర్ణించుకోలేరు" అని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. దీనిపై అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో అనేక సార్లు మాట్లాడానని చెప్పాడు.
ఇప్పటికీ అర్థం కాలేదు
అయితే, ఇది ఎలా జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని, ఈ ఫలితంపై తాము ఓ నిర్ధారణకు రాలేకపోయామని ఇయాన్ మోర్గాన్ అన్నాడు. ఇక, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఎవరూ ఓడిపోలేదని అన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్కు చేరుకున్న తర్వాత అక్కడి మీడియాతో మాట్లాడుతూ "ఇంగ్లాండ్ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా" అని చెప్పాడు.