For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్, వార్నర్‌లు లెక్కేం కాదు, ప్రపంచంలో ఏ జట్టునైనా.. : సెహ్వాగ్

Doesn’t matter if Australia don’t have Steve Smith, David Warner: Virender Sehwag warns India

హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ.. ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఓడించగల సత్తా కోహ్లీ సేనకు ఉందని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. నవంబరు 21నుంచి టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడనుంది. దీని తర్వాత డిసెంబర్‌ 6 నుంచి ఇరు జట్లు మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.

భారత్‌కిదే సరైన సమయమంటూ

భారత్‌కిదే సరైన సమయమంటూ

బాల్‌ టాంపరింగ్‌ కారణంగా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ లేని ఆస్ట్రేలియా జట్టును వారి గడ్డపై ఓడించడానికి భారత్‌కిదే సరైన సమయమంటూ చాలామంది వ్యాఖ్యానించారు. వారిలో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌తో పాటు అతని చిరాకాల మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా ఉన్నారు. అయితే సెహ్వాగ్‌ ఈ వ్యాఖ్యలను ఖండించాడు.

 ఇదే మాట ఏడాది నుంచి చెబుతున్నా.

ఇదే మాట ఏడాది నుంచి చెబుతున్నా.

కోహ్లీసేన ప్రదర్శనపై మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఎంతటి జట్టునైనా ఓడించగల సత్తా ప్రస్తుత భారత్‌కు ఉంది. ఈ మాట నేను ఏడాది నుంచి చెబుతున్నా. అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌ల్లోని మొదటి ఇన్నింగ్స్‌ల్లో బ్యాట్‌తో రాణిస్తేనే భారత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి' అని ఈ మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేకున్నా

అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేకున్నా

‘స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఆసీస్‌కు అది పెద్ద విషయమేమీ కాదు. వాళ్లు లేకపోయినా మిగతా ఆటగాళ్లు తమదైన శైలిలో అదే దూకుడు ప్రదర్శించగలరు. ప్రస్తుతం వారి టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ ఇప్పటికే అక్కడి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన వారే. వారికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకున్నా.. భారత్‌తో జరిగే పోరులో మంచి పోటీనే ఇవ్వగలరు.' అని వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మూడో టీ20

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మూడో టీ20

ప్రస్తుతం టీమిండియాతో వెస్టిండీస్‌తో ఆఖరి ఫార్మాట్‌లో చివరిదైన మూడో టీ20 ఆడనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆఖరి వన్డే ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, ఆఖరి టీ20లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని విండిస్ గట్టి పట్టుదలతో ఉంది.

Story first published: Saturday, November 10, 2018, 15:24 [IST]
Other articles published on Nov 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+