యాషెస్లో నాలుగో సెంచరీ
అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ (144; 219 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో ఆదుకోవడంతో యాషెస్ తొలి టెస్టులో తొలి రోజును ఆస్ట్రేలియా కాస్త గౌరవంగా ముగించింది. టెస్టుల్లో స్మిత్కు ఇది 24వ టెస్టు సెంచరీ కాగా యాషెస్లో మాత్రం నాలుగో సెంచరీ. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ అభిమానులు తనను ఎగతాళి చేయడంపై స్మిత్ స్పందించాడు.
ఎగతాళి చేయడం బాధించలేదు
"నిజాయితీ చెప్పాలంటే ఇక్కడి అభిమానులు నన్ను ఎగతాళి చేయడం బాధించలేదు. డ్రెస్సింగ్ రూమ్లో నా సహచర క్రికెటర్లు నాకు మద్దతుగా నిలిచారు. అదే నాకు ముఖ్యం. నేను వందకు చేరుకున్నప్పుడు సహచర క్రికెటర్లు బాల్కనీలో తీవ్రస్థాయిలో వెళ్ళారు. దానిని చూడగానే నా వెన్నుముకలో వణుకు తగ్గింది" అని అన్నాడు.
టెస్టు సెంచరీ చేసి చాలా కాలం అయింది
"ఇక, చాలా కాలం అయ్యింది, టెస్ట్ సెంచరీ.... ఇది చాలా పెద్ద క్షణం. ప్రస్తుతానికి ఏమి చెప్పాలో నాకు తెలియదు. గత 15 నెలలు నా జీవితంలో ఎంతో భారంగా గడిచాయి. నాకు నిజంగానే తెలియదు... నేను మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడబోనో. నేను ఒక సమయంలో క్రికెట్పై ప్రేమను కోల్పోయాను. నా మోచేయి ఆపరేషన్ జరిగినప్పుడు వింతగా అనిపించింది" అని స్మిత్ తెలిపాడు.
చాలా సంతోషంగా ఉంది
"ఎప్పుడైతే నా మోచేయి నొప్పి తగ్గిందో.. నేను మళ్లీ ఆటపై నా ప్రేమను కనుగొన్నాను. నేను క్రికెట్ ఆడాలి. ఆస్ట్రేలియా తరుపున మళ్లీ క్రికెట్ ఆడాలి. నాకు ఏదైతే ఇష్టమో దానిని ఆడుతున్నప్పుడు అభిమానులంతా గర్వపడాలి. నాకు ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ కలిగేది. నేను ఏదైతే కోల్పోయానో అది తిరిగి పొందాను. ప్రస్తుతం నేనున్న పరిస్థితులను చూస్తుంటే సంతోషంగా ఉంది" అని స్మిత్ తెలిపాడు.


Click it and Unblock the Notifications












