హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ ప్లాష్బ్యాక్స్ పేరిట మైఖేల్ తెలుగులో ప్రత్యేక వార్తలను ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీపక్ పటేల్ అనే క్రికెటర్ వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
భారత సంతతికి చెందిన దీపక్ పటేల్ పూర్వీకులు భారత్ నుంచి కెన్యాకు తరలివెళ్లారు. నైరోబీలో పుట్టిన దీపక్ పటేల్కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తన కోరికను నెరవేర్చుకునేందుకు గాను ఇంగ్లాండ్కు వలస వెళ్లాడు. అక్కడ ప్రయత్నించినప్పటికీ జట్టులో చోటు దక్కలేదు.
దీంతో ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్కు తరలివెళ్లాడు. దీంతో అక్కడ మంచి స్పిన్నర్ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్ తరఫున 1992 వరల్డ్కప్లో ప్రాతినిథ్యం వహించాడు. ఈ వరల్డ్కప్లో దీపక్ తొలి ఓవర్ వేశాడు.
పేస్ బౌలర్ కాకుండా ఒక స్పిన్నర్ తొలి ఓవర్ వేయడం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా, న్యూజిలాండ్ తరఫున దీపక్ పటేల్ 37 టెస్టులు, 75 వన్డేలు ఆడాడు.