ఆటకు దూరమైన 12 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు!

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ దినేశ్ మోంగియా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు దినేశ్ మోంగియా దూరమై సుమారు 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు.
1995లో పంజాబ్ తరఫున అండర్-19 జట్టులో అరంగ్రేటం చేసిన దినేశ్ మోంగియా చివరగా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో పంజాబ్ జట్టు తరఫున తన చివరి మ్యాచ్ని ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్లోనే అందరి దృష్టిని ఆకర్షించిన దినేశ్ మోంగియా ఆరేళ్ల పాటు దేశవాళీ క్రికెట్లో రాణించి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
2001లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ఆరంభించాడు. 2002లో గౌహతి వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 159 పరుగులతో సత్తా చాటాడు. భారత జట్టు తరఫున అతడు 57 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. వన్డేల్లో 27.95 యావరేజితో 1,230 పరుగులు చేశాడు. 14 వికెట్లు తీశాడు. ఇక, 121 ఫస్ట్క్లాస్ మ్యాచుల్లో అతను 21 సెంచరీలు చేశాడు.
లాంకషైర్, లైచెస్టర్షైర్ తరఫున అతను కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. ఇండియన్ క్రికెట్ లీగ్లో ఆడటంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. ఫలితంగా అతడు క్రికెట్కు దూరమయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్లో సెలక్టర్గా కూడా అతను బాధ్యతలు నిర్వర్తించాడు. రిటైర్మెంట్ సందర్భంగా మోంగియా మాట్లాడుతూ త్వరలో కోచ్గా బాధ్యతలు చేపడుతానని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications