న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటకు దూరమైన 12 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Dinesh Mongia announces retirement from all forms of cricket

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ దినేశ్ మోంగియా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్ మోంగియా దూరమై సుమారు 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు.

1995లో పంజాబ్‌ తరఫున అండర్‌-19 జట్టులో అరంగ్రేటం చేసిన దినేశ్ మోంగియా చివరగా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో పంజాబ్ జట్టు తరఫున తన చివరి మ్యాచ్‌ని ఆడాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించిన దినేశ్ మోంగియా ఆరేళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

'నా కెరీర్‌లో చేసిన ఉత్తమ గోల్ కన్నా... ఆమెతో చేసిన సెక్స్ ఎంతో గొప్పది''నా కెరీర్‌లో చేసిన ఉత్తమ గోల్ కన్నా... ఆమెతో చేసిన సెక్స్ ఎంతో గొప్పది'

2001లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ఆరంభించాడు. 2002లో గౌహతి వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 159 పరుగులతో సత్తా చాటాడు. భారత జట్టు తరఫున అతడు 57 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. వన్డేల్లో 27.95 యావరేజితో 1,230 పరుగులు చేశాడు. 14 వికెట్లు తీశాడు. ఇక, 121 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో అతను 21 సెంచరీలు చేశాడు.

లాంకషైర్, లైచెస్టర్‌షైర్ తరఫున అతను కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడటంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. ఫలితంగా అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో సెలక్టర్‌గా కూడా అతను బాధ్యతలు నిర్వర్తించాడు. రిటైర్మెంట్ సందర్భంగా మోంగియా మాట్లాడుతూ త్వరలో కోచ్‌గా బాధ్యతలు చేపడుతానని అన్నాడు.

Story first published: Wednesday, September 18, 2019, 17:52 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X