దీపికా పల్లికల్ కూడా:
ఆఖరి వరకూ సందిగ్ధంగా నడిచిన మ్యాచ్ను భారత, బంగ్లా అభిమానులు ఉత్కంఠతో వీక్షించారు. ఫైనల్లో ఐదు పరుగుల లక్ష్యానికి ఆఖరి బంతిని సిక్సు కొట్టి బంగ్లాపై గెలిచిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఆకర్షించింది. అందరితో పాటుగా దినేశ్ కార్తిక్ భార్య దీపికా పల్లికల్ కూడా లైవ్ మ్యాచ్ను ఎంతో ఉత్కంఠతతో ఆస్వాదించిందట.
రెండు బంతులు ఉండగా :
రెండు ఓవర్లలో 34 పరుగులు సాధించాలి. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ కళ్లు చెదిరే షాట్లతో జట్టును రేసులోకి తీసుకొచ్చాడు. అలా ఆడిన కార్తీక్కు రెండు బంతులు ఉండగా విజయ్ శంకర్ అవుటయ్యాడు. ఇక మిగిలింది ఒక్కటే బాల్. ఇన్నింగ్స్తో పాటుగా ట్రోఫీని గెలవాలంటే బంతికి 5 పరుగులు చేయాల్సిందే. అలాంటి సమయంలోనూ ఎలాంటి ఒత్తిడిలేకుండా సిక్స్ బాది భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
సోషల్ మీడియా ద్వారా:
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు కార్తిక్ సంచలన ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించారు. వారితో పాటుగా మ్యాచ్ను వీక్షించిన కార్తిక్ సతీమణి దీపికా పల్లికల్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా స్పందించారు.
మై దాదా..మై సూపర్ హీరో:
మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి.. 'భార్యగా గర్వపడుతున్నా అని పేర్కొన్నారు. ఆ ట్వీట్లో కార్తిక్ కనిపిస్తుండగా తన పెట్ డాగ్తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ 'మై దాదా..మై సూపర్ హీరో' అని క్యాప్షన్ కూడా పెట్టింది. స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికా అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటి ఎన్నో పతకాలు సాధించింది.