న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్పై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంభీర్ చాలా నైపుణ్యం గల క్రికెటరని, అతనికి రావలసినంత పేరు, ప్రఖ్యాతులు రాలేదన్నాడు. గంభీర్ ఇంకొంత కాలం భారత్కు ప్రాతినిధ్యం వహించాల్సిందని, కానీ అతని కోపం, ఏమోషనే కెరీర్ను దెబ్బతీశాయని వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ అయినా ఏదైనా ఇప్పట్లో ఉండవ్: కేంద్ర క్రీడామంత్రి
'గంభీర్కు చాలా టాలెంట్ ఉంది. కానీ తన కోపాన్ని, ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేడు. కానీ అపార నైపుణ్యం కలిగిన గంభీర్ మరికొంత కాలం భారత్ తరఫున ఆడాల్సిందనేది నా అభిప్రాయం 'అని టైమ్స్ఇండియాతో మాట్లాడుతూ అన్నాడు.
క్రికెట్ ఆడే రోజుల్లో మైదానంలోనే విరాట్ కోహ్లీతో గొడపడిన గౌతమ్ గంభీర్.. పాకిస్థాన్ క్రికెటర్లు అఫ్రిది, కమ్రాన్ అక్మల్తోనూ వాగ్వాదానికి దిగాడు. అలానే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపైనా తరచూ విమర్శలు గుప్పించాడు. 2003లో భారత్ తరఫున తొలిసారి ఆడిన గంభీర్.. 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో ఆటకు గుడ్బై చెప్పాడు.
అద్భుతమైన సాహసం.. 1200కిమీ సైకిల్ తొక్కిన జ్యోతికుమారిపై ఇవాంక ప్రశంసలు!!