తేటతెల్లమైన సందేహం:
న్యూజిలాండ్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సోమవారం ముంబైకి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్రవిడ్, భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో పాక్ ఆటగాళ్ల డ్రస్సింగ్ రూమ్కి వెళ్లినట్లు వస్తున్న వార్తలను అండర్-19 భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కొట్టి పారేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ ద్రవిడ్, జట్టు సారథి పృథ్వీ షా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

పాక్ మేనేజర్తో మాట్లాడారా:
ఈ నేపథ్యంలో ఓ విలేకరి టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో సెమీఫైనల్ అనంతరం మీరు ఆ జట్టు డ్రస్సింగ్ రూమ్లోకి వెళ్లి ఆటగాళ్లు, టీమ్ మేనేజర్తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్లారు? అని అడిగాడు.
అభినందించడంలో తప్పేంటి?:
‘నేను పాక్ డ్రస్సింగ్ రూమ్లోకి వెళ్లలేదు. ఆ జట్టులో ఒక ఎడమచేతి వాటం బౌలర్ టోర్నీలో బాగా రాణించాడు. అతన్ని అభినందించడానికి డ్రస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లాను. కానీ, రూమ్లోకి వెళ్లలేదు' అని ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు.

పరుగులు చేయకపోయినా:
టోర్నీలో భాగంగా భారత్-పాక్ మధ్య రెండో సెమీఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. పాక్ బ్యాట్స్మెన్లు పరుగులు చేయలేకపోయినప్పటికీ బౌలర్లు బాగానే శ్రమించారు.

నాలుగు సార్లు వరల్డ్ కప్:
ఫైనల్లో ఆసీస్ను చిత్తు చేసిన పృథ్వీ షా సేన ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. నాలుగుసార్లు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











