
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్టులో భారత్ ఘోరపరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు ముందుగానే కేఎల్ రాహుల్, మురళీ విజయ్, అజింకా రహానే, ఆర్ అశ్విన్లను తీసుకెళ్లమని బీసీసీఐ భారత జట్టుకు ముందుగానే సూచించిందంట.
మరి ఏ ఉద్దేశ్యంతోనో ఆ నిర్ణయాన్ని జట్టు ఆప్షనల్గా తీసుకుందట. పర్యటనలో మిగిలిన వాళ్లు అనవసరమనే విశ్వాసంతో జట్టు బయల్దేరిందని ప్రముఖ మీడియా ఛానెల్లో ఈ విషయం వెల్లడించింది.
డిసెంబరు 28వ తేదీ భారత్ దక్షిణాఫ్రికాకు చేరుకుంది. ముందుగా బీసీసీఐ రోహిత్ శర్మ్,, శిఖర్ ధావన్లను శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే మ్యాచ్ల నుంచి మినహాయించిందట. కానీ, పరిస్థితులను బట్టి వాళ్లిద్దరూ ఆ సిరీస్లలోనూ ఆడారు.
ఈ మాటలను ధ్రువీకరించే విధంగా కోహ్లీ కూడా దక్షిణాఫ్రికాలో చేరిన తర్వాత పాల్గొన్న మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రస్తుత జట్టుకు కూడా మంచి సమన్వయంతో సాగుతుంది. అని ప్రసంగించడంతో ఈ విషయం బలపడింది.
ఇదే విధంగా టీమిండియా అండర్-19 కోచ్ అయిన రాహుల్ డ్రావిడ్ జట్టు ఆటగాళ్లను ప్రాక్టీస్ నిమిత్తం ముందే పంపమంటూ విజ్ఞప్తి చేయడంతో బీసీసీఐ ఇందుకు ఆమోదించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.