హైదరాబాద్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరగా అవుట్ కావడంపై ట్విట్టర్లో జోకులు పేలుస్తున్నారు. టెస్టు మ్యాచుల్లో శిఖర్ ధావన్ ఇప్పటి వరకు పెద్దగా తన సత్తా చాటలేకపోయాడు.
కెల్ రాహుల్ గాయాల పాలు కావడంతో అతని స్థానంలో ధావన్ తుది జట్టులోకి వచ్చాడు. కొత్తగా టీంలోకి వచ్చిన పాత ఓపెనర్ గౌతం గంభీర్ను పక్కన పెట్టి కెప్టెన్ విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ను ఎంచుకున్నాడు. అయితే, అతను తన కెప్టెన్ ఆశలను నిలబెట్టలేకపోయాడు.

న్యూజిలాండ్ బౌలర్ మట్ హెన్రీ తొలి ఓవరులోనే ధావన్ అవుటయ్యాడు. హెన్రీ వేసిన బంతి ధావన్ బ్యాట్ లోపలి ఎడ్జ్ తీసుకుని వికెట్లను తాకింది. దీంతో ధావన్ కేవలం ఒక్క వరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీనిపై క్రికెట్ అభిమానులు ట్విట్టర్లో జోకులు వేస్తున్నారు.