న్యూయార్క్: ఆర్జనలో టాప్ టెన్ క్రికెటర్లలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్ర భాగాన నిలిచాడు. టాప్ టెన్ క్రికెటర్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. టాప్ టెన్ లో భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. పది మిలియన్ డాలర్ల ఆర్జనతో ధోనీ మొదటి స్థానంలో నిలువగా తర్వాతి టెండూల్కర్ దక్కించుకున్నాడు. టెండూల్కర్ ఆర్జన 8 మిలియన్ డాలర్లు ఉంది. యువరాజ్, ద్రావిడ్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. గంగూలీ, రికీ పాంటింగ్ ఆరవ స్థానాన్ని ఆక్రమించారు. క్లబ్, నేషనల్ టీం జీతాలు, వాణిజ్య ఆదాయాలను లెక్కలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. యువరాజ్ సింగ్ ఆదాయం 5.5 మిలియన్ డాలర్లు కాగా ద్రావిడ్ ఆదాయం 5 మిలియన్ డాలర్లు, గంగూలీ ఆదాయం 3.5 మిలియన్ డాలర్లు. పాంటింగ్ ఆదాయం కూడా 3.5 డాలర్లు.