
ప్రాక్టీసులోనూ, జట్టు ప్రచారంలోనూ:
అదే టీ20ల్లో మాత్రం ఆరో స్థానంలో ఫిక్సయ్యాడు. అదే తరహాలో ఈ ఏడాది ఐపీఎల్లోనూ ధోనీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవాలని భావిస్తున్నాడంట. ఎన్ని రోజుల నుంచో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7 శనివారం నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీసులోనూ, జట్టు ప్రచారంలోనూ చెన్నై జట్టు ఆటగాళ్లు జోరుగానే పాల్గొంటున్నారు.

తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో:
తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబైలోని వాంఖడే వేదికగా ఢీకొట్టనుంది. భారీ అంచనాల మధ్య అడుగుపెడుతున్న చెన్నై జట్టు కప్ గెలవడమే లక్ష్యంగా ఆడనుందట. ఇందులో భాగంగా ఇప్పటికే హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెన్నై కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ వెల్లడించాడు.

దూకుడుగా బ్యాటింగ్:
‘ఐపీఎల్లో మహేంద్రసింగ్ ధోనీ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. అతనికి బ్యాటింగ్ స్థానంతో సంబంధం ఉండదు. కానీ.. జట్టు అవసరాలకి అనుగుణంగా అతడి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని భావిస్తున్నాం.' అని స్టీఫెన్ ప్లెమింగ్ వెల్లడించాడు. ధోనీ.. మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్కి రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

మిడిలార్డర్ బలంగా:
కచ్చితంగా ఈ ఏడాది ఐపీఎల్లో బ్యాట్తో ధోనీ తన ప్రత్యేకతని చాటుకుంటాడు. కేదార్ జాదవ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావోలతో చెన్నై మిడిలార్డర్ బలంగా ఉంది. వీరిని సమర్థంగా వినియోగించుకుంటాం'


Click it and Unblock the Notifications
