31 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో
టీమిండియా విజయానికి 31 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన దశలో ధోని ఈ తప్పిదానికి పాల్పడ్డాడు. స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్లో బంతిని మిడ్ వికెట్ దిశగా తరలించిన ధోని.. నాన్స్ట్రైక్ ఎండ్వైపు సింగిల్ కోసం వెళ్లాడు. అయితే, క్రీజులోకి వెళ్లకుండా వెలుపలే ఆగిపోయాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేకపోయారు.
ధోని ఫినిషింగ్ టచ్తో
దీంతో ధోని ఖాతాలో, జట్టు స్కోరు బోర్డులోకి ఒక పరుగు చేరింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్లో ధోని ఫినిషింగ్ టచ్తో విజయం భారత్నే వరించిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
298 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ, మాక్స్వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలమయ్యాడు.
1-1తో సిరిస్ సమం
వికెట్ ఏమీ తీయకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.