
ధోనీ
నిన్నటి ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కంటే భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రభావమే భారత జట్టు ఆటగాళ్ల పైన ఉంటుందని అంటున్నారు.

ధోనీ
ముఖ్యంగా వన్డేలు, ట్వంటీ 20లలో ఒత్తిడి సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతాడని గుర్తు చేస్తున్నారు. ధోనీ అద్భుత ఫినిషర్.

ధోనీ
టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ధోనీ.. వన్డే, ట్వంటీ 20ల పైన దృష్టి సారించాడు. అతను దినదినాభివృద్ధి చెందడమే కాకుండా.. ఆటగాళ్లను ప్రభావితం చేస్తున్నాడు.

ధోనీ
శనివారం నాడు ధోనీ సేన జింబాబ్వే పైన గెలిచింది. ప్రపంచ కప్లో ధోనీసేనకు ఇది వరుసగా పదో విజయం.

ధోనీ
ఈ విజయం ద్వారా క్లీవ్ లాయిడ్ రికార్డ్ను ధోని అధిగమించాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ తడపడింది. ఆ సమయంలో ధోనీ (85) ఆదుకున్నాడు.

ధోనీ
సురేష్ రైనాకు (110 నాటౌట్) సూచనలు ఇస్తూ... అతను సెంచరీ చేసేలా చేశాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్కు 196 పరుగులు చేశారు.

ధోనీ
న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ మాట్లాడుతూ.. ఒత్తిడి సమయంలో ధోనీలా ఎవరు కూడా ఉండలేరన్నాడు. ఒత్తిడి సమయంలోను అతడు ఆటగాళ్లకు ప్రోత్సహిస్తాడని చెప్పాడు.

ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం గురించి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... ధోనీ సారథిగా సూపర్ డూపర్ కూల్ మ్యాన్ అన్నాడు.


Click it and Unblock the Notifications











