ముంబైలో జరిగిన కార్యక్రమంలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆ జాబితాను విడుదల చేశారు. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా నామినేట్ అయ్యారు. టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు హర్బజన్ సింగ్, లక్ష్మణ్ పోటీ పడుతున్నారు. టీ -20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ గా జహీర్ ఖాన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా అమిత్ మిశ్రా, ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ నామినేటయ్యారు.