చెన్నై : క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మరో వారం రోజులు. అంతే! ఈ నెల 23వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుల హోరాహోరీగా తలపడబోతున్నాయి.
నాడు కోచ్ లేకుండానే ధోనీ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచిన టీమిండియా
దీనికోసం ఇరు జట్లూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నై చేరుకున్న సూపర్ కింగ్స్ జట్టు నెట్ ప్రాక్టీస్ లో తలమునకలైంది. ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. డైనమేట్ వంటి షాట్లు ఆడారు.
ధోనీ, సురేశ్రైనా, అంబటిరాయుడుతో పాటు పలువురు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ లో ప్రాక్టీస్ చేశారు. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్యాటింగ్ కోచ్ హస్సీ ఆటగాళ్లకు సూచనలు ఇచ్చారు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ధోనీ ఎక్కువగా భారీ షాట్లు ఆడాడు. యువ బౌలర్ల బౌలింగ్లో వరుసపెట్టి సిక్సర్లు బాదాడు.
140 seconds of Classic #Thala Dhoni! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/079ZXqdUaS
— Chennai Super Kings (@ChennaiIPL) March 16, 2019
దీనికి సబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. నెట్ ప్రాక్టీస్ లో ధోనీ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డారు. పాదాలను చురుగ్గా కదుపుతూ భారీ షాట్లు ఆడాడు. అతను కొట్టి ప్రతి షాట్ కూడా బంతి స్టాండ్స్ లో వెళ్లి పడింది. దీనితోఈ సారి కూడా ఐపీఎల్ లో ధోనీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారని అంటున్నారు.