హైదరాబాద్: ధోనీ స్థానంలో జట్టులో చేరిన రిషబ్ పంత్పై నెటిజన్లు చురకలు కురిపిస్తున్నట్లుగానే ఉంది అతని ప్రదర్శన కూడా. వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ పక్కకి తప్పుకుంటే.. అతని స్థానాన్ని జట్టులో భర్తీ చేసే క్రికెటర్గా మొదట నుంచీ వినిపిస్తున్నపేరు రిషబ్ పంత్. మైదానంలో ఒత్తిడి దరిచేరనీయకుండా స్వేచ్ఛగా హిట్టింగ్ చేయగల నైపుణ్యం, 20 ఏళ్ల యువ క్రికెటర్ కావడంతో మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం ఇతనికే అవకాశమివ్వాలని పట్టుబడుతున్నారు.
గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ టార్గెట్ 140 పరుగులే కావడంతో.. జట్టుపై ఒత్తిడి తక్కువగా ఉంది. దీంతో.. రిషబ్ పంత్కి స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ ఆర్డర్లో అతడ్ని ఒక స్థానం ముందుకు జరిపి మూడో స్థానంలో పంపించారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ విసిరిన యార్కర్ బంతి (తాను ఎదుర్కొన్న రెండో బంతి)ని కళ్లు చెదిరే రీతిలో లాంగాన్ దిశగా బౌండరీకి తరలించిన రిషబ్ పంత్.. తర్వాత ఓవర్లోనే రుబెల్ హుస్సేన్ బౌలింగ్లో బంతిని వికెట్లపైకి ఆడుకుని బౌల్డయ్యాడు.
దీంతో.. వరుసగా రెండో మ్యాచ్లోనూ అతను నిరాశపరిచినట్లైంది. ముక్కోణపు టీ20 సిరీస్లో వికెట్ కీపర్గా ప్రస్తుతం దినేశ్ కార్తీక్ ఉన్నా.. రిషబ్ పంత్కు కూడా టోర్నీ చివర్లో కీపర్గా ఛాన్సివ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. అయితే.. బ్యాట్స్మెన్గా హిట్ అయితేనే.. ఆత్మవిశ్వాసంతో వికెట్ కీపింగ్ చేయగలడని మేనేజ్మెంట్ భావిస్తోంది. కానీ.. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించే ఈ యువ హిట్టర్.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు.
తాజాగా కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడగా.. శ్రీలంకపై 23 పరుగులు, బంగ్లాదేశ్పై పరుగులకే పరిమితమయ్యాడు. కెరీర్లో ఇప్పటి వరకు నాలుగు టీ20లు ఆడినా పంత్ చేసింది 73 పరుగులే. ఇందులో అత్యధిక స్కోరు 38 మాత్రమే. మరి.. సోమవారం శ్రీలంకతో జరగనున్న మూడో టీ20 మ్యాచ్లోనైనా ఈ జూనియర్ ఏ స్థాయి ప్రదర్శన ఇవ్వగలడనేది ప్రశ్నార్థకం.