డెత్ ఓవర్లలో ఎక్కువ ఒత్తిడి
డెత్ ఓవర్లలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి... ఒత్తిడికి గురైన చాహర్ తొలి రెండు బంతుల్ని నోబాల్స్గా విసిరాడు. దీంతో ఓవర్ పడకుండానే 8 పరుగులు పంజాబ్ ఖాతాలో చేరాయి. దీంతో మైదానంలో కెప్టెన్ కూల్గా పేరొందిన ధోని అసహనంతో కోల్పోయాడు. చాహర్పై కోపడ్డాడు. ధోని కోపాన్ని చూసిన చాహర్ ఆ తర్వాత తొలి 5 బంతులకి 1, 1, 1, 1, 1 రూపంలో సింగిల్స్ ఇచ్చాడు.
|
వరుసగా రెండు నోబాల్స్ వేయడంపై
అదే ఓవర్ ఆఖరి బంతికి పంజాబ్ విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీయడం తీసి చెన్నైకి విజయాన్ని అందించాడు. ఈ ఘటనపై దీపక్ చాహర్ మాట్లాడుతూ "వరుసగా రెండు నోబాల్స్ వేయడంపై ధోని భాయ్ నాపై కోపంతో ఊగిపోయాడు. నేను పెద్ద తప్పు చేశాను. దీంతో ధోని వద్దకు వచ్చి నాకు మద్దతు నిలిచాడు" అని తెలిపాడు.
ఐదు బంతుల్లో సింగిల్స్ ఇవ్వడంతో
అయితే, ఆ తర్వాత వేసిన ఐదు బంతుల్లో సింగిల్స్ ఇవ్వడంతో మ్యాచ్ అనంతరం జట్టులోని ఆటగాళ్లు తనను అభినందించారని చెప్పుకొచ్చాడు. "మ్యాచ్ అనంతరం జట్టులోని ప్రతి ఒక్కరూ నన్ను అభినందించారు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశావ్ అని అన్నారు. ధోని భాయ్ కూడా నవ్వుతూ నా వద్దకు వచ్చి హగ్ చేసుకుని 'వెల్డన్' అని చెప్పాడు" అని దీపక్ చాహర్ అన్నాడు.
రెండు చెత్త బంతులను వేశానని నాకు తెలుసు
"నేను రెండు చెత్త బంతులను వేశానని నాకు తెలుసు. వెంటనే పుంజుకున్నా. ఈ సీజన్లో ధోని నాకు ఎంతో మద్దతుగా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో చెన్నై విజయాల్లో నా పాత్ర కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నా" అని దీపర్ చాహర్ తెలిపాడు. కాగా, క్రికెట్ నిబంధనల ప్రకారం ఒకే ఓవర్లో బౌలర్ రెండు నో బాల్స్ విసిరిన తర్వాత అతడిని బౌలింగ్ నుంచి అంపైర్ తప్పిస్తారు.