

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2019 సీజన్లో మెరుపులు మెరిపించడం ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2019 సీజన్ కోసం గతేడాది డిసెంబర్లో నిర్వహించిన వేలంలో కనీస ధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన యువరాజ్ను టోర్నీలోని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు తొలుత ఆసక్తి కనబర్చలేదు. దీంతో తొలివిడత వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు.
అయితే, చివర్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం యువీని కనీస ధరకే కొనుగోలు చేసింది. వాంఖడే వేదికగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టులోని ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. దీంతో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తోన్న వీడియోని ముంబై ఇండియన్స్ ట్విటర్లో అభిమానులతో పంచుకుంది.