జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. లమిచ్చమే స్థానంలో క్రిస్ మోరిస్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగిస్తోంది.
ఢిల్లీ ఆడిన 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్కు మరింత చేరువవ్వాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్తో రాజస్థాన్ భవితవ్యం తేలనుంది. రాజస్థాన్కు చావోరేవో మ్యాచ్ కాబట్టి ఆ జట్టు ఆటగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉంది. యువకులతో నిండిన ఢిల్లీ ధీటుగా సమాధానం చెప్పేందుకు రెడీగా ఉంది.
జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్:
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషబ్ పంత్, కొలిన్ ఇంగ్రామ్, క్రిస్ మోరిస్, రూథర్ఫోర్డ్, అక్షర్ పటేల్, కాగిసో రబాడ, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ.
రాజస్తాన్ రాయల్స్:
అజింక్యా రహానే, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, టర్నర్, స్టువర్ట్ బిన్నీ, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనాద్కత్, ధావల్ కులకర్ణి.