ముంబై: ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్కు ఢిల్లీ డేర్ డెవిల్స్ షాకిచ్చింది. యువరాజ్ సింగ్ను ఢిల్లీ వదిలేసింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్లు ఇషాంత్ శర్మ, డేల్ స్టెయిన్లను జట్టు నుంచి విడుదల చేసింది. ఐపీఎల్ 9 నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి.
తిరిగి భారత టీ20 జట్టులో చోటు సంపాదించినప్పటికీ యువరాజ్ను ఢిల్లీ వదిలేసుకుంది. గత వేలంలో రూ.16 కోట్ల భారీ మొత్తానికి యువరాజ్ను కొన్న ఢిల్లీకి అతడు నిరాశనే మిగిల్చాడు. 14 మ్యాచ్ల్లో 19.
07 సగటుతో కేవలం 248 పరుగులు చేశాడు.
శ్రీలంక ఆల్ రౌండర్ మాథ్యూస్ను కూడా ఢిల్లీ వదిలేసింది. యువరాజ్, మాథ్యూస్ల విడుదల ద్వారా రూ.23 కోట్లు పొదుపు చేశామని హేమంత్ చెప్పాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వీరేంద్ర సెహ్వాగ్ను వదిలేసుకుంది. సెహ్వాగ్తో పాటు జార్జ్ బెయిలీని కూడా వదిలేసింది.
ఏఏ జట్లు ఎవరిని వదులుకున్నాయి?
డారెన్ సామి (బెంగళూరు), ప్రజ్ఞాన్ ఓజా, హేజిల్ వుడ్ (ముంబై), దినేశ్ కార్తీక్ (బెంగళూరు), కెవిన్ పీటర్సన్, స్టెయిన్ (హైదరాబాద్)లు ఆయా ఫ్రాంఛైజీలు వదిలేసిన ఇతర ప్రముఖ ఆటగాళ్లు. మొత్తంగా ఏ ఏడాది ఆరు ఫ్రాంఛైజీలు 101 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, 61 మందిని వదిలేశాయి.
గరిష్టంగా బెంగళూరు 14 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఢిల్లీ, కోల్కతలు చెరో 10 మందిని, పంజాబ్, సన్రైజర్స్ చెరో ఎనిమిది మందిని విడుదల చేశాయి. ఫిబ్రవరి 6న బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతుంది. రూ.36.85 కోట్ల అత్యధిక మొత్తంలో ఈసారి ఢిల్లీ వేలంలో పాల్గొననుంది. రూ.30.15 కోట్లతో సన్రైజర్స్ రెండో స్థానంలో ఉంది.