IPL 2025: ఫ్యాన్స్ దీనిని అలవాటుగా మార్చుకోవాలని ఎందుకంటే తన కెప్టెన్సీలో ఇలాగే జరుగుతుందని ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఒక వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించిన అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 209 పరుగులు చేసింది. ఢిల్లీ 65 పరుగుల వద్దే 5 వికెట్లను కోల్పోయింది. అయినా కూడా ఢిల్లీ జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది.
గెలుపు తర్వాత అక్షర్ పటేల్ ఏమన్నారంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ విజయం తర్వాత అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. "మీరు దానికి అలవాటు పడాలి ఎందుకంటే నా నిర్ణయాలు హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి. ఇప్పుడు మ్యాచ్ గెలిచాం కాబట్టి ఎవరూ ఏమీ అనరు. స్టబ్స్ ను ఎందుకు బౌలింగ్ చేయించారని ఎవరూ అడగరు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలవడం సాధారణంగా క్రికెట్ లో జరగదు కానీ నేటి కాలంలో క్రికెట్ చాలా మారుతోంది, కాబట్టి ఒకరు క్రీజులో ఉంటే చాలు. ఒక బౌలర్గా ఇదంతా ఒక మైండ్ గేమ్ అని నేను భావిస్తున్నాను. లక్నో ఆట తీరు ప్రారంభమైన తీరు చూస్తే.. పవర్ ప్లేలో మేము చాలా పరుగులు ఇచ్చాము. కానీ చివరి ఏడు ఓవర్లలో మేము వారిని అదుపు చేశాం. వేగం మాకు అనుకూలంగా మారింది. ఆటగాళ్లు కష్టపడి పరుగులను ఆపారు. మా సామర్థ్యాలు మాకు తెలుసు. మొదటి మ్యాచ్ ఒత్తిడిలో కూడా ఇలా ఆడినందుకు క్రెడిట్ విఫ్రజ్దే. అతను ఈ ప్రదర్శనను కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది." అని అక్షర్ పటేల్ అన్నాడు.

గెలిచే మ్యాచ్ను అప్పగించాడు
"ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ పెద్ద తప్పు చేసి గెలిచే మ్యాచ్ ను ఢిల్లీకి అప్పగించాడు. వాస్తవానికి చివరి ఓవర్లో ఢిల్లీ జట్టు గెలవడానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరం. లక్నో తరఫున షాబాజ్ అహ్మద్ చివరి ఓవర్ వేశాడు. అశుతోష్ కాదు.. మోహిత్ శర్మ బ్యాటింగ్ ఎండ్ లో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో షాబాజ్ అద్భుతమై ఫ్లైట్ బంతిని బౌలింగ్ చేశాడు. దానిని మోహిత్ ఆడలేకపోయాడు. ఈ బంతిని ఆడటానికి ప్రయత్నిస్తుండగా.. మోహిత్ తన కాలును ముందుకు చాపి క్రీజు నుంచి బయటకు వచ్చాడు. కానీ ఆ తర్వాత బంతి బ్యాట్ ముందు తిరిగింది. ఈ క్రమంలో రిషబ్ పంత్ మోహిత్ ను ఔట్ చేయడానికి మంచి అవకాశం లభించింది. కానీ పంత్ బాల్ను పట్టుకోలేకపోయాడు. మోహిత్ కు మంచి ఛాన్స్ లభించింది. ఈ మ్యాచ్ లో ఇదే అతిపెద్ద మలుపు. ఈ మ్యాచ్లో పంత్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. సున్నా పరుగులు చేసి ఔటయ్యాడు." అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ లో ఏం జరిగింది?
ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ 31 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ ను మూడు బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ తేడాతో ఓడించింది. షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో అశుతోష్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అశుతోష్ తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అంతకు ముందు లక్నో బ్యాటర్లు నికోలస్ పూరన్(75), మిచెల్ మార్ష్(72) అర్థ సెంచరీలతో చెలరేగడంతో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతో విజయాన్ని సాధించింది.