ఆ తప్పులే కొంపముంచాయి: అక్షర్ పటేల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. రెండు జట్లు కూడా అద్భుతమైన క్రికెట్ ఆడాయని, ఇంతటి క్లోజ్ గేమ్లో ఓటమికి సంబంధించి ఏదో ఒక కారణాన్ని వేలెత్తి చూపడం కష్టమని అక్షర్ పటేల్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, కొన్ని కీలక విషయాలను ప్రస్తావించాడు.
అదే దెబ్బతీసింది..
లక్ష్య ఛేదనలో తాము మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని అక్షర్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా కీలక సమయాల్లో వికెట్లు పడటం తమ జట్టును దెబ్బతీసిందని అక్షర్ పేర్కన్నాడు. ఆ వికెట్లు గనుక పడకుండా ఉంటే, మ్యాచ్ని మరికొంత ముందుగానే ముగించే అవకాశం ఉండేదని విశ్లేషించాడు. అత్యంత క్లిష్టమైన సమయంలో వికెట్లు కోల్పోవడం వల్లనే చివర్లో ఒత్తిడి పెరిగిందని అక్షర్ వివరించాడు.

కేఎల్ రాహుల్ బ్యాటింగ్పై అక్షర్ ప్రశంసల వర్షం.
ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను అక్షర్ పటేల్ కొనియాడాడు. "రాహుల్ నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ప్లేలో మాకు లభించిన జోరును అతను ఇన్నింగ్స్ అంతా కొనసాగించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, అతను ఏమాత్రం రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఒంటరి పోరాటం చేస్తూ జట్టును విజయం అంచు వరకు తీసుకువచ్చారు" అని రాహుల్ బ్యాటింగ్ను అక్షర్ పటేల్ ప్రశంసించాడు.
చివరగా, తమ జట్టు ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడుతోందని అక్షర్ పటేల్ ధీమా వ్యక్తం చేశాడు. కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోవడం నిరాశ కలిగించినప్పటికీ, తప్పులను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్లో ఖచ్చితంగా గెలుస్తామని ఆయన నమ్మకాన్ని వెలిబుచ్చాడు. తదుపరి పోరులో మెరుగైన ప్రదర్శనతో టోర్నీలో తిరిగి పుంజుకుంటామని అక్షర్ పటేల్ ముగించాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (70), వాషింగ్టన్ సుందర్ (55), జోస్ బట్లర్ (52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
రాహుల్-మిల్లర్ మెరుపులు వృథా
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(92), పాతుమ్ నిస్సంక (41) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 76 పరుగులు జోడించారు. అయితే మిడిల్ ఆర్డర్లో నితీష్ రాణా(5), సమీర్ రిజ్వీ (0) వరుస బంతుల్లో ఔట్ కావడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 92 పరుగులు చేసిన రాహుల్ (11 ఫోర్లు, 4 సిక్సర్లు), సెంచరీకి చేరువలో సిరాజ్ బౌలింగ్లో అవుట్ కావడం మ్యాచ్ను మలుపు తిప్పింది. చివర్లో డేవిడ్ మిల్లర్(41) మెరుపులు మెరిపించినప్పటికీ.. ఢిల్లీ లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications