DC vs RR: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగుతున్న మ్యాచ్లో కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రాజస్థాన్ తరపున ఓపెనింగ్ బ్యాటర్ గా అద్భుతాలు చేశాడు. సంజు శాంసన్ తన బ్యాటింగ్ సమయంలో ఫోర్లు, సిక్సర్లు కూడా కొట్టాడు. సంజు శాంసన్ తన ఇన్నింగ్స్ లో ఎంఎస్ ధోనిని కూడా అధిగమించాడు. అంటే ధోని కంటే ఓ సిక్సర్ ను అధికంగా బాదాడు. అయితే సంజు శాంసన్ మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. సంజు ఔట్ కాకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోండి.
ఔట్ కాకుండానే పెవిలియన్ కు ఎందుకు తిరిగివచ్చాడు?
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ రాజస్థాన్ కు శుభారంభం అందించారు. వీరిద్దరూ కలిసి రాజస్థాన్ స్కోరును 5 ఓవర్లలో 50/0కి తీసుకెళ్లారు. 5.3 ఓవర్లలోనే సంజు శాంసన్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి కొన్ని బంతుల ముందు సంజు శాంసన్ బ్యాక్ ఫుట్ నుంచి లాంగ్ సిక్స్ కొట్టాడు. ఆ సమయంలో సంజు శాంసన్ కు వెన్నునొప్పి వచ్చింది. దీని తర్వాత సంజు శాంసన్ కొన్ని బంతులు ఆడిన అనంతరం రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయానికి రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ 2 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేసి ఔట్ కాకుండానే వెనుదిరిగాడు.

ఎంఎల్ ధోని రికార్డును బద్దలు కొట్టిన సంజు శాంసన్.
ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ఎంఎస్ ధోని తన టీ20 కెరీర్లో 346 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 3 సిక్సర్లు కొట్టి, ఎంఎస్ ధోనిని మించిపోయాడు. ఇప్పుడు సంజు శాంసన్ పేరు మీద టీ20 క్రికెట్లో 347 సిక్సర్లు ఉన్నాయి. సిక్సర్లు కొట్టడంలో సంజు కెప్టెన్ కూల్ను వెనక్కి నెట్టాడు.