DC vs RR: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంగా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కు 189 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 37 బంతుల్లో 49 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ జట్టు తరపున అభిషేక్ పోరెల్ తో పాటు కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్(34), ట్రిస్టన్ స్టబ్స్(34*), అశుతోష్ శర్మ(15*) రాణించారు.

ఇదిలా ఉండగా మొదట్లో దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ అనంతరం వికెట్లు పడిపోవడంతో నెమ్మదిగా ఆడింది. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కరుణ్ నాయర్.. ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు చేయకుండానే రనౌట్ గా వెనుదిరిగాడు. కానీ చివరి 5 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 77 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణ, వనిందు హసరంగా తలో వికెట్ తీశారు.