అదే మా లక్ష్యం : రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరువవుతున్న వేళ పాయింట్ల పట్టికలో కీలకమైన 48వ మ్యాచ్కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో టాస్ కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ఏమాత్రం సంకోచించకుండా ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. హోం గ్రౌండ్లో భారీ స్కోరు సాధించి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాలని ఢిల్లీ భావిస్తోంది.
టాస్ నిర్ణయం వెనుక అక్షర్ పటేల్ వ్యూహం
టాస్ గెలిచిన అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడుతూ పిచ్ పరిస్థితులను వివరించాడు. "ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది, అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డుపై మంచి స్కోరు ఉంచాలనుకుంటున్నాం. తద్వారా రెండో ఇన్నింగ్స్లో మా బౌలర్లకు ప్రయోజనం చేకూరవచ్చు" అని వెల్లడించాడు. పాయింట్ల పట్టిక గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి లోనుకాకుండా, కేవలం ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టి సహజసిద్ధమైన ఆట ఆడాలని తన జట్టుకు సూచించినట్లు అక్షర్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఓ మార్పు జరిగింది. కైల్ జేమీసన్ స్థానంలో స్టార్ పేసర్ లుంగీ ఎంగిడి జట్టులోకి వచ్చాడు.

గైక్వాడ్ ధీమా.. చెన్నై జట్టులో అనూహ్య మార్పులు
మరోవైపు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నామని, టాస్ ఓడిపోయినా తాము అనుకున్నదే జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశాడు. "పిచ్ పొడిగా ఉంది, కాబట్టి మ్యాచ్ మొత్తం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మొదటి మూడు మ్యాచ్ల వైఫల్యం తర్వాత మా జట్టు అన్ని విభాగాల్లోఅద్భుతంగా పుంజుకుంది. ఇదే విజయ పరంపరను కొనసాగించడమే మా లక్ష్యం" అని ధీమా వ్యక్తం చేశాడు. అయితే గాయం కారణంగా ఘోష్ అందుబాటులో లేకపోవడంతో చెన్నై తుది జట్టులో రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. వెస్టిండీస్ స్పిన్నర్ అఖీల్ హోసేన్, యువ ఆటగాడు గుర్జప్నీత్ సింగ్ తుది జట్టులోకి ప్రవేశించారు.
ప్లే-ఆఫ్ రేసులో కీలకంగా మారిన మ్యాచ్
ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్ల ప్లే-ఆఫ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది 'డూ ఆర్ డై' లాంటి మ్యాచ్. స్వదేశీ ప్రేక్షకుల మద్దతు మధ్య అక్షర్ పటేల్ సేన ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. అటు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే ఇప్పటికే మంచి ఫామ్లో ఉండటంతో మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్ నెమ్మదిస్తే స్పిన్నర్లకు పండగే అని చెప్పాలి, ఈ క్రమంలో అక్షర్ పటేల్, అఖీల్ హోసేన్ వంటి స్పిన్నర్ల పాత్ర కీలకం కానుంది.
తుది జట్లు ఇవే..:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి.నటరాజన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications