For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ పై శ్రీలంక 334 పరుగుల ఆధిక్యత

By Pratap
Mahela Jayawardene
అహ్మదాబాద్: భారత్ పై జరుగుతున్న తొలి టెస్టు తొలి మ్యాచులో శ్రీలంక భారీ స్కోరు చేసింది. శ్రీలంక తన తొలి ఇన్నింగ్సును గురువారం నాలుగో రోజు ఏడు వికెట్ల నష్టానికి 760 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్సు స్కోర్ 426 పరుగులకు జవాబుగా శ్రీలంక ధాటిగా ఆడి భారీ స్కోరు చేసింది. మహీళా జయవర్దనే శ్రీలంక స్కోరును పరుగులు పెట్టించి 275 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. జయవర్దనే 22 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రసన్న, మహీళా జయవర్దనే ఆరో వికెట్ కు 351 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రసన్న జయవర్దనే 154 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచాడు.

ఐదు వికెట్లు నష్టపోయి 591 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శ్రీలంక గురువారం బ్యాటింగ్ ను ప్రారంభించి మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులను జత చేసింది. దీంతో శ్రీలంక 760 పరుగుల భారీ స్కోరు సాధించింది. టెస్టు మ్యాచుల్లో 9 వేల పరుగుల మైలు రాయి దాటిన తొమ్మిదో బ్యాట్స్ మన్ గా మహేలా జయవర్దనే రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్బజన్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. అమిత్ మిశ్రాకు ఒక వికెట్ లభించింది. గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ భారత్ రెండో ఇన్నింగ్సును ప్రారంభించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+