
రామ్కుమార్ గెలుపుతోనే భారత తొలిరౌండ్ విజయం
రామ్కుమార్ గెలుపుతోనే భారత తొలిరౌండ్ విజయం 3-1తో ఖరారైంది. దీంతో ఆ తర్వాత జరగాల్సిన భాంబ్రీ మ్యాచ్ నామమాత్రమే అయింది. దీంతో బెస్టాఫ్ త్రీ సెట్స్గా నిర్వహించిన ఈ ఆఖరి మ్యాచ్లో యుకీ భాంబ్రీ 7-5, 3-6, 6-4తో జోస్ స్టాథమ్పై విజయం సాధించాడు. తొలిరోజు భాంబ్రీ, రామ్కుమార్ సింగిల్స్ మ్యాచ్లు గెలవగా, డబుల్స్లో లియాండర్ పేస్-విష్ణువర్దన్ జోడీ ఓడిన సంగతి తెలిసిందే.

ఫాస్టెస్ట్ సర్వీసులు, ఏస్లతో హడలెత్తించిన రామ్కుమార్
రామనాథన్ ఈ మ్యాచ్లో తనకన్నా తక్కువ ర్యాంకర్ ఫిన్ టిర్నేని ఫాస్టెస్ట్ సర్వీసులు, ఏస్లతో హడలెత్తించాడు. రామ్ 9 డబుల్ ఫాల్ట్స్ చేసినప్పటికీ మొత్తంగా 105 పాయింట్లు, 12 ఏస్లతో పైచేయి సాధించాడు. 15 బ్రేక్ చాన్స్ల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. ఒకే ఒక ఏస్ సంధించిన టిర్నే 16 డబుల్ ఫాల్ట్స్తో మూల్యం చెల్లించుకున్నాడు.

హోరాహోరీగా సాగిన పోరు
ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేయలేకపోయాడు. ఉత్కంఠగా మొదలైన తొలి సెట్లో టిర్నే గట్టి పోటీ ఇవ్వడంతో పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరూ సర్వీ్సలు నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే 6-5తో ఉన్న దశలో 12వ గేమ్లో బ్రేక్ సాధించిన రామ్కుమార్ తొలిసెట్ను ఖాతాలో వేసుకున్నాడు.

35 నిమిషాల్లోనే ఈ సెట్ను దక్కించుకున్న రామ్ కుమార్
రెండో సెట్లో భారత ఆటగాడు మరింత రెచ్చిపోయాడు. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీ్సను బ్రేక్ చేసి 35 నిమిషాల్లోనే ఈ సెట్ను దక్కించుకున్నాడు. ఇక మూడో సెట్లో పూర్తిగా రామ్కుమార్ హవానే సాగింది. రామ్ ఏకంగా మూడు బ్రేక్లు సాధించి 6-0తో సెట్తోపాటు మ్యాచ్ను కూడా ముగించేశాడు.

డబుల్స్లో విజయం సాధించడం చాలా కష్టం
మ్యాచ్ అనంతరం భారత జట్టు నాన్ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్రాజ్ మాట్లాడుతూ డబుల్స్లో విజయం సాధించడం చాలా కష్టం, అందుకే సింగిల్స్పై ఎక్కువ దృష్టి సారించామని అన్నాడు. మూడు మ్యాచ్ల్లో గెలవాలన్న లక్ష్యంతో దిగామని, నాలుగు సింగిల్స్లో గెలిచామన్నాడు. రామ్కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. భవిష్యత్లో భారత్కు అతడు మరిన్ని విజయాలు అందిస్తాడన్న నమ్మకం ఉందన్నాడు.


Click it and Unblock the Notifications











