హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-9లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఒంటి చేత్తో విజేతగా నిలిపిన ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్ ప్రస్తుతం తన భార్య, పిల్లలతో అమెరికాలోని న్యూయార్క్లో సందడి చేస్తున్నాడు.
దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా గడిపిన వార్నర్ తన భార్య, ఇద్దరు ముద్దుల కూతుళ్లతో సరదాగా గడుపుతున్నాడు. కాగా, ఈ ఫోటోలను వార్నర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
త్వరలో వెస్టిండీస్లో జరగనున్న ముక్కోణపు సిరీస్లో ఆస్ట్రేలియా తరపున వార్నర్ పాల్గొనాల్సి ఉంది. ఈ ముక్కోణపు సిరీస్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.