హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఏడాదిపాటు అంతర్జాతీయ క్రికెట్కు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య కాలంలో లీగ్ మ్యాచ్ల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్లో ఆడిన వార్నర్... తాజాగా ఆస్ట్రేలియాలో డార్విన్స్ లిమిటెడ్ ఓవర్స్ స్ట్రైక్ లీగ్లో ఆడాడు.
ఈ మేరకు ఈ లీగ్లోని సిటీ సైక్లోన్తో వార్నర్ ఒప్పందం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం నార్త్రన్ టైడ్ జరిగిన మ్యాచ్లో 36 పరుగులతో వార్నర్ ఫర్వాలేదనిపించాడు. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్క్రాఫ్ట్లు ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.
వార్నర్, స్టీవ్ స్మిత్లపై ఏడాది పాటు నిషేధం విధించగా, బాన్క్రాఫ్ట్పై తొమ్మిది నెలల పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అయితే దేశవాళీ లీగ్ల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి ఇచ్చిన క్రమంలో ఈ ముగ్గురూ లీగ్ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అయితే బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత డేవిడ్ వార్నర్ తన సొంతగడ్డ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం.