న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ గడ్డపై శ్రీలంక క్లీన్ స్వీప్: ధోని, క్లార్క్ సరసన దాసన్ షణక

Dasun Shanaka joins MS Dhoni in elite list as Sri Lanka clean sweep Pakistan 3-0 in T20I series

హైదరాబాద్: దాసన్ షణక నాయకత్వంలోని శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేసింది. ఒషాడ ఫెర్నాండో (78) హాఫ్ సెంచరీతో రాణించడంతో బుధవారం జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ క్రమంలో శ్రీలంక కెప్టెన్ దాసన్ షణక ఓ అరుదైన రికార్డుని సాధించాడు. పాకిస్థాన్ జట్టుపై 3 టీ20ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన మూడో కెప్టెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు పాకిస్థాన్ జట్టుపై 3 టీ20ల సిరిస్‌ను నెగ్గిన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(2007-2012), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌లు మాత్రమే ఉన్నారు.

India vs South Africa, Day 1: పూణె టెస్టులో నిరాశపరిచిన రోహిత్ శర్మIndia vs South Africa, Day 1: పూణె టెస్టులో నిరాశపరిచిన రోహిత్ శర్మ

ధోని సరసన షణక

ధోని సరసన షణక

ఇప్పుడు వీరి సరసన దాసన్ షణక నిలిచాడు. భద్రతా కారణాల దృష్ట్యా లసిత్ మలింగ లాంటి శ్రీలంక సీనియర్ క్రికెటర్లు పాకిస్థాన్ పర్యటన నుంచి తప్పుకోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో కూడిన జట్టుని పాకిస్థాన్ పర్యటనకు పంపింది. టీ20ల్లో తన కంటే ఎంతో బలహీనమైన ఈ జట్టు చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది.

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఈ ఓటమి మింగుపడటం లేదు. అంతేకాదు పదేళ్ల తర్వాత సొంతగడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య అద్భుత ప్రదర్శన చేద్దామన్న పాక్ ఆటగాళ్ల ఆశలు ఆవిరయ్యాయి. స్వదేశంలో జరిగిన తొలి టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

మూడో టీ20లో

మూడో టీ20లో

బుధవారం జరిగిన మూడో టీ20లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఒషాదా ఫెర్నాండో (78 నాటౌట్‌, 48 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్టు కోల్పోయ 134 పరుగులకే పరిమితమైంది.

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‌గా హసరంగా

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‌గా హసరంగా

పాక్‌ ఆటగాళ్లలో హారిస్‌ సోహైల్‌ (52; 50 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. శ్రీలంక బౌలర్లలో వనిండు హసరంగా మూడు వికెట్లు తీయగా.. లహిరు కుమార రెండు వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో రాణించిన హసనరంగాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌', ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డులు లభించాయి.

Story first published: Thursday, October 10, 2019, 11:32 [IST]
Other articles published on Oct 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X