For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final:భారత జట్టులో అతడే అత్యంత విలువైన ఆటగాడు.. అసలైన 3డీ ప్లేయర్ కూడా: పాక్ మాజీ ప్లేయర్

Danish Kaneria says Ravindra Jadeja as Indias most Valuable Player In WTC Final
Ravindra Jadeja 3D Player - Team India's Most Valuable Player | Oneindia Telugu

కరాచీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టులో జడేజా అత్యంత విలువైన ఆటగాడని, అసలైన 3డీ ప్లేయర్ అని కొనియాడాడు. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు జడేజా అత్యంత కీలకం అవుతాడని చెప్పాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల, పరుగులు చేయగల సామర్థ్యం అతడికి ఉందని.. ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కనేరియా చెప్పుకోచ్చాడు. భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానుంది.

జడేజా 3డీ ఆటగాడు

జడేజా 3డీ ఆటగాడు

తాజాగా డానిష్ కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడాడు. 'ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బౌలర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్లు వికెట్లు తీస్తేనే మనం మ్యాచ్‌లు గెలవగలం. రవీంద్ర జడేజా గురించి చెప్పాలంటే.. అతడో 3డీ ఆటగాడు. అలాంటి క్రికెటర్‌ను పక్కన పెట్టేయడం సులభం కాదు. అతడు కచ్చితంగా ఆడాల్సిందే. జడ్డూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తాడు. లోయర్‌ ఆర్డర్‌లో పరుగులు చేస్తాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పుతాడు. ఇక మెరుపు ఫీల్డింగ్‌తో ఒకట్రెండు రనౌట్లు చేయగలడు. అందుకే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌లో అతడే అత్యంత విలువైన ఆటగాడు' అని కనేరియా పేర్కొన్నాడు.

10 మ్యాచుల్లో 469 పరుగులు, 28 వికెట్లు

10 మ్యాచుల్లో 469 పరుగులు, 28 వికెట్లు

హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్‌ రావడంతో రవీంద్ర జడేజాకు జట్టులో చోటు లేకుండా పోయింది. రెండేళ్లు జడేజాకు పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన అవకాశాలు లభించలేదు. టెస్టు జట్టులో ఉన్నప్పటికీ రిజర్వు బెంచీపైనే ఉన్నాడు. ఎప్పుడైతే వెన్నెముక గాయంతో హార్దిక్ జట్టుకు దూరమయ్యాడో జడ్డూ కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేశాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని 10 మ్యాచుల్లో జడేజా 469 పరుగులు చేశాడు. ఇక బంతితో 28 వికెట్లు పడగొట్టాడు.

సౌతాంప్టన్‌లో మొదటి ప్రాక్టీస్‌

సౌతాంప్టన్‌లో మొదటి ప్రాక్టీస్‌

న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ జూన్‌ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కఠిన క్వారంటైన్‌ శనివారం ముగియడంతో.. ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్‌ సెషన్‌ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. రవీంద్ర జడేజా తాను నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'సౌతాంప్టన్‌లో మొదటి ప్రాక్టీస్‌' అంటూ కెప్టెన్ ఇచ్చాడు.

Story first published: Monday, June 7, 2021, 14:06 [IST]
Other articles published on Jun 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+