For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ పదవీకాలం మరో 3 ఏళ్ల పాటు పొడిగింపు? బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలు!

Dadas reign to continue for 3 years? Sourav Gangulys time as BCCI president might increase after AGM proposes constitutional amendments

హైదరాబాద్: ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పదవీ కాలాన్ని బోర్డు పొడిగించే ఆలోచనలో ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన బోర్డుకు సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో డిసెంబర్‌ 1న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 88వ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీసీసీఐ సెక్రటరీ జైషా మొత్తం 12 పాయింట్లతో కూడిన ఏజెండాను బోర్డు సభ్యుల ముందు ఉంచనున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించనున్నారు.

బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే

బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే

అయితే, బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే బోర్డు సభ్యుల్లో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం. అలాగే బోర్డు సభ్యులు మద్దతు తర్వాత సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. మొత్తం 12 పాయింట్లతో కూడిన ఏజెండాలో పలు కీలక విషయాలను చర్చించనున్నారు. ఇందులో ముఖ్యమైనది కూలింగ్ ఆఫ్ పిరియడ్.

వరుసగా రెండు పర్యాయాలు

వరుసగా రెండు పర్యాయాలు

బీసీసీఐలో అధ్యక్షుడిగా లేదా కార్యదర్శిగా వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన వారికి కూలింగ్ ఆఫ్ పిరియడ్ అమలు చేయబడుతుంది. ఇందులో భాగంగా రెండోసారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం ఉండాల్సిందే. ఇప్పుడు దీనిని గనుక సవరిస్తే మరో ఆరేళ్ల పాటు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగొచ్చు.

తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో

తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో

ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో కొనసాగుతాడు. వీటితో పాటు ఈ 12 పాయింట్ల ఎజెండాలో అంబుడ్స్‌మన్‌తో పాటు ఎథిక్స్ ఆఫీసర్, కొత్త క్రికెట్ కమిటీలు, క్రికెట్ అడ్వైజరీ కమిటీతో పాటు పలు బోర్డు నియమ నిబంధనలకు సవరణలను ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలో పలు నిబంధనలను తొలగించే ఆలోచనలో బోర్డు ఉంది.

విరుద్ధ ప్రయోజనాల అంశంపై కూడా

విరుద్ధ ప్రయోజనాల అంశంపై కూడా

ప్రస్తుతం భారత క్రికెట్‌లో అతిపెద్ద సమస్యగా మారిన అంశం ఇది. దీనివల్ల అత్యుత్తమ క్రికెటర్ల సేవలను బీసీసీఐ ఉపయోగించుకోవడం కష్టంగా మారింది. గతంలో విరుద్ధ ప్రయోజనాల అంశం పేరిట క్రికెట్‌ సలహా కమిటీలో సభ్యులుగా ఉన్న సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌కు అంబుడ్స్‌మన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్‌కు ఈ అంశం సెగ తగిలింది. దీంతో ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Story first published: Monday, November 11, 2019, 17:16 [IST]
Other articles published on Nov 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+