For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచ టోర్నీ ప్రచారకర్తలుగా డబ్బావాలా

ముంబై: ఐసిసి ప్రపంచ టీ20 టోర్నీమెంట్‌ కోసం ముంబైలో పరిచయమక్కర్లేని డబ్బావాలాలు పని చేయనున్నారు. ముంబై నగరంలోని అనేక కార్యాలయాల ఉద్యోగులకు భోజనం అందించటంలో వీరిది కీలకపాత్ర అని వేరే చెప్పనక్కర్లేదు.

కాగా, భారత్‌లో మార్చి 8 నుంచి ఐసీసీ టీ20వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి వినూత్నంగా ప్రచారం చేయాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకోసం డబ్బావాలాలను ప్రచారకర్తలుగా నియమించుకుంది.

Dabbawalas will promote ICC World T20 tournament

మంగళవారం నుంచి ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ సుమారు నెలరోజులు పాటు జరగనుంది. ఈ సందర్భంగా ముంబైలోని డబ్బావాలాతో టీ20 ప్రపంచకప్‌నకు ప్రచారం చేయిచేందుకు శ్రీకారం చుట్టారు. సుమారు 50వేల డబ్బావాలాలు ఈ ప్రచార కార్యాక్రమంలో పాల్గొంటారు.

సోమవారం నుంచి వీరంతా టీ20 ప్రపంచకప్‌ లోగో కలిగిన టీషర్ట్‌లు ధరించి తమ విధుల్లో పాల్గొంటారు. టోర్నీ సూపర్‌-10 దశకు చేరుకున్న తర్వాత 25మంది డబ్బావాలాలను ఎంపిక చేసి వారికి ప్రత్యేకమైన దుస్తులు అందజేస్తారు. అంతేగాక, ముంబైలో జరిగే మ్యాచ్‌లకు స్టేడియంలోకి వీరిని అనుమతి ఇస్తారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+