ప్రపంచకప్లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా మరికొద్ది సేపట్లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో చివరి మ్యాచ్కు దూరమైన ఆమ్లా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐడెన్ మార్క్రమ్ బెంచ్ కి పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా మరో స్పిన్నర్ ను తీసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్ నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ ను తీసుకుంది. టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలతో బరిలోకి దిగుతోంది. షమీ, జడేజాలు తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. ఇప్పటికే రెండు ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సౌతాఫ్రికా ప్రపంచకప్లో బోణీ చేయాలని చూస్తోంది. మరోవైపు ఆరంభ మ్యాచ్లో విజయంతో టోర్నీని ఆరంబించాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
వర్షం కారణంగా మంగళవారం పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. పచ్చికను పూర్తిగా తొలగించారు. పిచ్ బ్యాటింగ్కు సహకరించే వీలుంది. ఈ కారణంతోనే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. బుధవారం వర్షం కురిసే అవకాశం తక్కువే. అయితే చల్లని వాతావరణం మ్యాచ్పై ప్రభావం చూపొచ్చు.
ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్ల్లో గెలుపొందగా.. దక్షిణాఫ్రికా 46 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్లో నాలుగు సార్లు తలపడగా.. భారత్ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు ప్రొటీస్ విజయం సాధించింది.
{headtohead_cricket_3_6}
జట్లు:
భారత్:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), లోకేశ్ రాహుల్, ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, బుమ్రా.
దక్షిణాఫ్రికా :
క్వింటన్ డికాక్, ఆమ్లా, డుప్లెసిస్ (కెప్టెన్), వాన్ డర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, డుమిని, ఫెలుక్వాయో, క్రిస్మోరీస్, రబాడ, ఇమ్రాన్ తాహిర్, షంషీ.
South Africa win the toss and elect to bat #SAvInd #CWC19 #Indvsa pic.twitter.com/rQ9Ti6DdS3
— MyKhel Telugu (@myKhelTelugu) June 5, 2019