ప్రపంచకప్లో భాగంగా మరికొద్ది సేపట్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ధావన్ స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా.. పాక్ను కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్ను ఓడించి ప్రపంచకప్లో తన ముద్రను చెరిపేసుకోవాలని పాక్ చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మాంచెస్టర్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 18 మ్యాచ్ల్లో గెలవగా.. ఛేజింగ్ చేసిన జట్టు 27 మ్యాచ్ల్లో నెగ్గింది. 2018 నుంచి టీమిండియా 22 మ్యాచ్ల్లో 16 సార్లుఛేజింగ్ చేసి నెగ్గింది.
జట్లు:
భారత్:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్:
ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, వాహబ్ రియాజ్, మొహమ్మద్ ఆమిర్.
{headtohead_cricket_3_5}